ఎదురెదురుగా బైక్ల ఢీ - ముగ్గురికి తీవ్ర గాయాలు
ABN, First Publish Date - 2021-01-16T05:12:44+05:30
ఎదురెదురుగా మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా, వారి లో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది.
కందుకూరు, జనవరి 15 : ఎదురెదురుగా మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా, వారి లో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది.కందుకూరు నుం చి కనిగిరికి ఇద్దరు యువకులు వెళ్తున్న మోటారు సైకిల్ని ఎదురుగా పొన్నలూరు నుంచి వస్తున్న యువకుడు దూబగుంట సమీపంలో ఢీకొట్టాడు. రెండు మోటారు సైకిళ్లు అతివేగంగా వస్తూ ఢీకొనడటంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారి ముగ్గురిని స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2021-01-16T05:12:44+05:30 IST