ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి
ABN, First Publish Date - 2021-12-06T04:29:26+05:30
ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని చిమట గ్రామంలో చోటుచేసుకుంది.
మర్రిపూడి, డిసెంబరు 5 : ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని చిమట గ్రామంలో చోటుచేసుకుంది. చాగంరెడ్డి అక్షర(3) నానమ్మతో కలిసి కేంద్రంలో పాలు పోసేందుకు వెళ్లింది. ఆ సమయంలో లైట్లు లేకుండా వస్తున్న ట్రాక్టర్ చిన్నారిని ఢీకొనడంతో తీవ్రంగా గాయాలపాలైంది. గాయాలపాలైన అక్షరను హుటాహుటిన చికిత్స కోసం చీమకుర్తికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతదేహాన్ని తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ను నడిపినట్లు స్థానికులు చెప్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు రవి, కుమారిలు మృతదేహాన్ని చూసి విలపించిన తీరు పలువురిని కంఠతడి పెట్టించింది. సమాచారం అందుకున్న హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
Updated Date - 2021-12-06T04:29:26+05:30 IST