గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
ABN, First Publish Date - 2021-01-26T06:36:26+05:30
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్ భాస్కర్
ఒంగోలు(కలెక్టరేట్), జనవరి 25 : గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ పోలా భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్య్ర సమరయోఽధులకు సన్మానంతో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శన ఉంటుంది. వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేయనున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం స్థానిక ప్రకాశం భవన్లోని స్పందన భవన్లో జాతీయసమైక్యత, సమగ్రతపై సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
Updated Date - 2021-01-26T06:36:26+05:30 IST