ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహ్మద్‌ ప్రవక్త బోధనలు ఆచరణీయం

ABN, First Publish Date - 2021-10-20T06:31:56+05:30

మహ్మద్‌ ప్రవక్త బోధనలను ప్రతిఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొన్నారు.

ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌

కనిగిరి, అక్టోబరు 19: మహ్మద్‌ ప్రవక్త బోధనలను ప్రతిఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొన్నారు. మిలాద్‌-ఉన్‌-నబి పర్వదినం సందర్భంగా షాదీఖానాలో మంగళవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త నడిచిన బాటలో ప్రతి ఒక్కరు కొనసాగాలని సూచించారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు షేక్‌ అబ్దుల్‌ కలాంముఫ్తీ షేక్‌ మస్తాన్‌ మహ్మద్‌ ప్రవక్త సందేశాలను తెలిపారు. నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలు మసీదులకు సంబంధించిన మతపెద్దలు, ఎస్సై రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగనాయకులరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, అంజుమన్‌ ఏ.ఇస్లామియా కమిటీ పెద్దలు, నగర పంచాయతీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

టీడీపీ ఆధ్వర్యంలో : మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్‌-ఉన్‌-నబి పండుగ వేడుకలను టీడీపీ ముస్లీం మైనార్టీ సెల్‌ ఆద్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పట్టణ సమీపంలోని కొత్తూరులోని బదిరుల పాఠశాల, మదర్సాలో పిల్లలకు అన్నదానం చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మహ్మద్‌ ప్రవక్త బోధనలను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమ్మినేని వెంకటరెడ్డి, ముస్లీం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 

పామూరు : ఇస్లాం వ్యవస్థాపకుడు మహ్మద్‌ ప్రవక్త జన్మదినం మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలను పలు రాజకీయపార్టీల ఆధ్వర్యంలో పామూరులో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.  టీడీపీ మండల ముస్లిం మైనార్టీసెల్‌ ఆద్వర్యంలో స్థానిక అబ్దుల్‌ కలాం కూడలిలో వేడుకలు నిర్వహించి జన్మదిన కేక్‌ను మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రి చౌదరి, పువ్వాడి రామారావులు చేతుల మీదుగా కేక్‌ను కట్‌చేసి శ్రేణులకు పంపిణీ చేశారు. స్థానిక మదర్సా కేంద్రంలోని విద్యార్థులకు దుస్తులను అందజేసి ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మదర్సా నిర్వాహకులు మౌలానా షరీఫ్‌ హుస్సేనీతో పాటు టీడీపీ నాయకులు యూ.హరిబాబు, కే.సుభాషిణి, ఎం.హుస్సేన్‌రావు,  టీడీపీ మైనార్టీసెల్‌ నాయకులు షేక్‌ గౌస్‌బాష, ఖాజారహంతుల్లా, ఆర్‌ఆర్‌ రఫీ, మస్తాన్‌, కౌలూరి ఖాజారహంతుల్లా, షేక్‌ చిన్న హజరత్‌, మొబీనా మౌలాలితో పాటు స్థానిక ముస్లీం నాయకులు పాల్గొన్నారు. ఏపీ ముస్లిం సఘం ఆధ్వర్యంలోనూ ఈ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలోఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌ తేజప్రతిమ చేతుల మీదుగా పలువురు రోగులకు రొట్టెలు, పండ్లను అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం సంఘం నియోజకవర్గ అద్యక్షుడు షేక్‌ హసన్‌ , ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అబ్దుల్‌ రషీద్‌, పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షుడు చాంద్‌బాష, ఖాదర్‌బాష, హపీసాబ్‌, కరిముల్లా, ఉద్యోగ సంఘం అద్యక్షులు షేక్‌ షరీప్‌, నాయబ్‌ రసూల్‌, సుబాని తదిరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising