ఆలయాల భద్రతకు పటిష్ట చర్యలు
ABN, First Publish Date - 2021-01-20T06:47:20+05:30
జిల్లాలో దేవాలయాల భద్రతను పటిష్టం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.
పలు దేవాలయాలను సందర్శించిన ఎస్పీ
ఒంగోలు(క్రైం), జనవరి 19 : జిల్లాలో దేవాలయాల భద్రతను పటిష్టం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. మంగళవారం సింగరాయకొండ, జరుగుమల్లి, పొదిలి, గిద్ద లూరు మండలాల్లో ఉన్న ఆలయాలను పరిశీలించారు. అక్కడ పోలీసులతోపాటుగా ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో రెవెన్యూ, పోలీసులు, గ్రామ వలంటీర్లు, డిఫెన్స్ కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పూజారులు, పాస్టర్లు, మౌజమ్లు, గ్రామపెద్దలతో సమా వేశాలు ఏర్పాటుచేయాలని పోలీసుల కు సూచించారు. ఆయన వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, పొదిలి, గిద్దలూ రు సీఐలు శ్రీరామ్, సుధాకరరావు, ఎస్సైలు సంప త్కుమార్, నాయబ్ రసూల్ ఉన్నారు.
Updated Date - 2021-01-20T06:47:20+05:30 IST