ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల లేఖ

ABN, First Publish Date - 2021-08-29T20:03:11+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు లేక రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు లేక రాశారు. గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదులను తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరారు. గతంలో కూడా వారు వెలిగొండ ప్రాజెక్టు అంశానికి సంబంధించి ప్రకాశం జిల్లా ప్రజల మనోభావాలు, కోస్తా జిల్లాల ప్రజలు ఏమనుకుంటున్నది తదితర వాటిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 


ప్రకాశం జిల్లా రైతులకు వరప్రదాయనిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, నీటి కేటాయింపులు కూడా జరపొద్దని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా యాజమాన్యం బోర్డుకు లేఖ రాయడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని చెప్పడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు లేదని, ఈ ప్రాజెక్టు చేర్చాలని జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేయకపోవడం పట్ల ప్రకాశం జిల్లా రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉందని టీడీపీ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాలకు ప్రజలు, రైతాంగాన్ని బాధితుల్ని చేయడం సరికాదన్నారు.

Updated Date - 2021-08-29T20:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising