విద్యార్థుల ఫీజులు, సర్టిఫికెట్లు ఇచ్చివేయాలి
ABN, First Publish Date - 2021-10-21T06:03:49+05:30
అద్దంకిలో విద్యా సంవత్సరం మధ్యలో మూసివేసిన గాయత్రీ జూ నియర్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులతో ఆర్ఐవో వీవీ.సుబ్బారావు బుధవారం మాట్లాడా రు.
ఆర్ఐవో వీవీ.సుబ్బారావు
అద్దంకిటౌన్ అక్టోబరు 20: అద్దంకిలో విద్యా సంవత్సరం మధ్యలో మూసివేసిన గాయత్రీ జూ నియర్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులతో ఆర్ఐవో వీవీ.సుబ్బారావు బుధవారం మాట్లాడా రు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చివేయాలని యాజమాన్యానికి సూచించారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కళాశాలలోనే ఈ ఏడాదికి చదువు చెప్పాలని, అందుకు యాజమాన్యం, క ళాశాల అధ్యాపకులు అంగికరించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇంటర్ బోర్డు నుంచి ఏ ప్రాంతంలో, ఏ పేరు మీద అయితే కళాశాల నిర్వహించేందుకు అనుమతులు తీసుకున్నారో ఆ కళాశాలలోనే తరగతులు నిర్వహించాలని, లేని పక్షంలో ఆయా కళాశాలపై చర్యలు తీసుకుంటామని ఆర్ఐవో హెచ్చరించారు. అద్దంకిలో పలు జూనియర్ కళాశాలలు అనుమతులు పొందిన ప్రాంతాల్లో కా కుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారని స మాచారం ఉందని, అటువంటి వాటిపై తనిఖీ చే సి చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాం తాల్లో తరగతులు పెట్టుకోవాలంటే బోర్డు అనుమతి వచ్చిన తరువాతే నిర్వహించాలన్నారు.
Updated Date - 2021-10-21T06:03:49+05:30 IST