ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణానికి నోచుకోని షాదీఖానా

ABN, First Publish Date - 2021-03-08T05:53:50+05:30

మార్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్‌లో ముస్లింలకు కేటాయించిన ఉర్దూఖర్‌, షాదీఖానా నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు.

షాదీఖానాకు కేటాయించిన స్థలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోటాపోటీగా శంకుస్థాపనలు

నిరుపయోగంగా మారుతున్న స్థలం

మార్కాపురం (వన్‌టౌన్‌) మార్చి 7: మార్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్‌లో ముస్లింలకు కేటాయించిన ఉర్దూఖర్‌, షాదీఖానా నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. కంభం సెంటర్‌ లోని చిన్నపిల్లల పార్కు స్థలాన్ని చాలా ఏళ్ల కిందట షాదీఖానా నిర్మాణానికి కేటాయించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ రాజీవ్‌ నగరబాటలో భాగంగా మార్కాపురం పట్టణం వచ్చినప్పుడు సాగర్‌ జలాల కోసం రూ.36 కోట్లు, పట్టణంలో ముస్లింల కోసం షాదీఖానా నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వాలు మారుతున్నా నేటి వరకు  షాదీఖానా నిర్మాణం జరగలేదు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన రాయి వేశారు. టీడీపీ హయాం లో అప్పటి మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 2016లో శంకుస్థాపన చేశారు. పోటాపోటీగా శంకుస్థాపనలు జరిగాయే తప్ప నేటికీ నిర్మాణానికి నోచుకోలేదు. షాదీఖానా స్థలం మాత్రం బహిరంగ మలమూత్ర విసర్జనకు ఉపయోగపడుతూ పాయిఖానాగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.  




Updated Date - 2021-03-08T05:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising