ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై నిలిచిన మురుగు నీరు

ABN, First Publish Date - 2021-10-20T05:56:48+05:30

గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్ష్యణ లోపంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కుంటను తలపిస్తున్న వైనం

అవస్థలు పడుతున్న గ్రామస్థులు, ప్రయాణికులు

పుల్లలచెరువు, అక్టోబరు 19 : గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్ష్యణ లోపంతో పారిశుధ్యం  అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న కోట్ల రూపాయల నిధులు అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రధానంగా మండలంలోని రచకొండ పంచాయతీ రచకొండ గ్రామంలో ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఆరు నెలలుగా డ్రైనేజీ నీరు రోడ్డుపై చేరి  కంపు కొడుతోంది. రోడ్డుపై నుంచి డ్రైనేజీ నీరు పంట భూముల్లోకి వెళ్తుండడంతో రైతులు తమ భూము లను కాపాడుకునేందుకు కట్టపోయడంతో రోడ్డుపై  డ్రైనేజీ నీరు కుంటను తలపిస్తోంది. ఆర్‌అండ్‌బీ రోడ్డు కావడంతో నిత్యం పుల్లలచెరువు కార్యాలయానికి వెళ్లే ప్రజలు, ప్రయాణికులు, అధికారులు సైతం  నీటి అడుగు భాగంలో ఏమి ఉంటుందోనని భయాందోళనలకు  గురవుతున్నారు. రోజులతరబడి నీరు నిలిచి ఉండడంతో  దోమలకు ఆవాసంగా మారుతోంది. దీంతో ఏం రోగాలు వస్తాయోనని ప్రజలు వణుకుతున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో ప్రధాన రోడ్డుపై నిలిచిఉన్న మురుగు నీటిని తొలగించేలా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-20T05:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising