ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరువురు టీచర్లకు సంజాయిషీ నోటీసులు

ABN, First Publish Date - 2021-11-27T06:10:43+05:30

పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో విధుల కు హాజరు కాని ఇరువురు ఉపా ధ్యాయులకు డీఈవో బి.విజయ భాస్కర్‌ శుక్రవారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

రికార్డులను తనిఖీ చేస్తున్న డీఈవో విజయభాస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలువిద్య, నవంబరు 26 : పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో  విధుల కు హాజరు కాని ఇరువురు ఉపా ధ్యాయులకు డీఈవో బి.విజయ భాస్కర్‌ శుక్రవారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. గిద్దలూ రు మండలంలోని దిగువమిట్ట మండల పరిషత్‌ ప్రాఽథమిక పా ఠశాలను శుక్రవారం ఉదయం 9.20 గంటలు డీఈవో అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మొత్తం ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, ఒక ఉపాధ్యాయు డు మాత్రమే విధులకు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయుడు సెలవు చీటీ లేకుండా విధులకు గైరుహాజరయ్యారు. మరో ఉపాధ్యాయిని ఆలస్యంగా వచ్చారు. విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరవడం పట్ల డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వురు టీచర్లకు ఛార్జీ మోమోలు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడు తూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవ హరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2021-11-27T06:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising