ఆర్యవైశ్యుల సమారాధన
ABN, First Publish Date - 2021-10-25T05:37:53+05:30
దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య సమారాఽధన (సహపంక్తి భోజనం) కార్యక్రమం నిర్వహించారు.
గిద్దలూరు, అక్టోబరు 24 : దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య సమారాఽధన (సహపంక్తి భోజనం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకుసుమ హరనాథ మందిరం ఆవరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు శివపురం ఆంజనేయులు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-25T05:37:53+05:30 IST