దళితుల సమస్యలను పరిష్కరించాలి
ABN, First Publish Date - 2021-05-11T07:25:59+05:30
రాష్ట్రంలో దళితుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి తగున్యాయం చేయాలని దళితసేన, దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఐ.ప్రేమ్కుమార్ డిమాండ్ చేశారు.
దర్శి, మే 10: రాష్ట్రంలో దళితుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి తగున్యాయం చేయాలని దళితసేన, దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఐ.ప్రేమ్కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం రాష్ట్ర దళితసేన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్కుమార్ మాట్లాడుతూ జిల్లా దళిత సంఘాల నాయకుడు నీలం నాగేంద్రరావు భూమిని ఆక్రమించుకున్న ఓపార్టీ నాయకునిపై చట్టపర చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత కరోనా దృష్ట్యా ప్రతిదళిత కుటుంబాని ఉచిత బియ్యం పంపిణీ చేయాలని, దళితలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళితసేన నాయకులు కె.మార్కు, జి.పెద్ద వెంకటస్వామి, అనపర్తి ఏసోబు, జార్జి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.బ్రహ్మయ్య తదితరులు సంఘీ భావం తెలిపారు.
Updated Date - 2021-05-11T07:25:59+05:30 IST