ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాలిప్పించండి సారూ..!

ABN, First Publish Date - 2021-01-17T06:37:51+05:30

కంభం ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు లేవని కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బంది ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎదుట వాపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంభం, జనవరి 16 : కంభం ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు లేవని కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బంది ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎదుట వాపోయారు. శనివారం ఆయన వైద్యశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన పారిశుధ్య సిబ్బంది తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతోపాటు సెలువులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈవిషయాన్ని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళితే ‘తాను కొత్తగా వచ్చాను, తనకేమి తెలియదంటున్నారని’ ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలు ఎలా గడవాలని వాపోయారు. కాంట్రాక్టర్‌, అధికారులతో మాట్లాడి తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాను సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరి స్తానన్నారు.

Updated Date - 2021-01-17T06:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising