Prakasam: మద్యం మత్తులో వ్యక్తిని బైక్తో ఢీకొన్న ఏఆర్ కానిస్టేబుల్
ABN, First Publish Date - 2021-12-30T16:24:09+05:30
డ్రంకన్ డ్రైవ్ ప్రమాదకరమంటూ ప్రచారం చేస్తున్న పోలీసులు ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు.
ఒంగోలు: డ్రంకన్ డ్రైవ్ ప్రమాదకరమంటూ ప్రచారం చేస్తున్న పోలీసులు ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ మద్యం మత్తులో బైక్ను నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. సంఘమిత్ర హాస్పటల్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు దినేష్ రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వల్ప గాయాలపాలైన కానిస్టేబుల్ శివకృష్ణ ఓ ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-12-30T16:24:09+05:30 IST