ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-11-05T18:12:46+05:30

ప్రకాశం జిల్లాలోని కంభం ఎస్డీసీ కార్యాలయంలో ఎదుట వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని కంభం ఎస్డీసీ కార్యాలయంలో ఎదుట వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ నిర్వాసితులు రామినేని మాధవరావు, రామినేని కృష్ణకుమారి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధితులు అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాజెక్టు నిర్వాసిత లబ్దిదారుల జాబితాలో అధికారులు తమకు నష్ట పరిహారం రాకుండా చేశారంటూ సూసైడ్ లేఖలో మాజీ కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ మురళి, ఎస్టీసీ విజయ్ కుమార్ పేర్లను బాధితులు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా కాల్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదంటూ సూసైడ్ లేఖలో బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-05T18:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising