ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ABN, First Publish Date - 2021-03-05T13:22:39+05:30
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే నెల్లూరు జిల్లా కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు. బస్సు బెంగళూరు నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-03-05T13:22:39+05:30 IST