విద్యుత్ ఓవర్లోడ్ను తగ్గించుకోవాలి
ABN, First Publish Date - 2021-10-15T05:25:32+05:30
పరిశ్రమల వినియోగదారులు విద్యుత్ ఓవర్లోడ్ను తగ్గించుకోవాలని ఆపరేషనల్ ఈఈ పి.శ్రీనివాసరావు సూచించారు. గురువారం రాత్రి గుండ్లాపల్లి గ్రోత్సెంటరులో ఏఈ రవి ప్రకాష్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
మద్దిపాడు, అక్టోబరు 14 : పరిశ్రమల వినియోగదారులు విద్యుత్ ఓవర్లోడ్ను తగ్గించుకోవాలని ఆపరేషనల్ ఈఈ పి.శ్రీనివాసరావు సూచించారు. గురువారం రాత్రి గుండ్లాపల్లి గ్రోత్సెంటరులో ఏఈ రవి ప్రకాష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పరిశ్రమల నిర్వాహకులు వి ద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని, లేని పక్షంలో పలు సమస్యలు త లెత్తుతాయన్నారు. ఉదయం 6-30 నుంచి 9-30 వరకు విద్యుత్ సమ స్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. డీఈఈ గురునాథరావు మాట్లాడుతూ విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ కాకుండా చూడాల్సిన బాధ్యత అ ధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-10-15T05:25:32+05:30 IST