ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సడలింపు వేళ గుంపులుగా ప్రజలు

ABN, First Publish Date - 2021-05-19T07:44:15+05:30

లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నారు.

దర్శి బస్టాండ్‌లో గుంపులుగా తిరుగుతున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా

దర్శి, మే 18 : లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నారు. షాపుల వద్ద, పండ్ల దుఖాణాల వద్ద కొనుగోళ్లు సమయంలో గుంపులుగా చేరుతున్నారు. ఆ సమయంలో అధికారులు పర్యవేక్షణ లేకపోవటంతో ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సామాజికదూరం పాటించకపోవటంతో పాటు అనేకమంది మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో కరోనా దర్శిలో ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. 

దర్శిలో ఇప్పటికే 300 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా రెట్టింపు ఉన్నాయి. సుమారు 20 మందికి పైగా మృతిచెందారు. మహమ్మారి ప్రజల ప్రాణాలు అధికసంఖ్యలో బలికొంటున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు అధికారులు లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై ప్రజలు తిరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నా సడలింపు సమయంలో పట్టించుకోవటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కరోనా మరింత ఉధృతమయ్యే ప్రమాదం నెలకొంది. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు సామాజికదూరం పాటించటంతో పాటు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-05-19T07:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising