ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు పవన్‌ రాక

ABN, First Publish Date - 2021-01-21T06:17:19+05:30

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాత్రికి ఒంగోలులో బస

23న ఎస్పీతో భేటీ, 

వెంగయ్య కుటుంబానికి పరామర్శ

ఒంగోలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగురోజుల క్రితం బేస్తవారపేట మండలం సింగరపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించి పార్టీపరంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారు. గ్రామం లో సమస్యల విషయమై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నిం చడం, ఆ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించిన తీరు, అనంతరం గ్రామంలో అధికారపార్టీకి చెందిన నేతల ఒత్తిడితో మనస్తాపం చెంది వెంగయ్య ఆత్మ హత్య చేసుకున్నట్లు జనసేన నాయకులు ఆరోపించిన విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారు. పార్టీవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈనెల 22న పవన్‌ తిరుపతి నుంచి రోడ్డుమార్గాన సాయంత్రానికి ఒంగో లు చేరుకొని రాత్రికి ఇక్కడే బసచేస్తారు. 23న ఎస్పీని కలిసి ఘటనపై చర్చించడంతో పాటు వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున ఆర్థికసహాయం అందించనున్నారు. కాగా శుక్రవారం పవన్‌ పర్యటన పూ ర్తి వివరాలపై స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెప్పారు. 


Updated Date - 2021-01-21T06:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising