పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలి
ABN, First Publish Date - 2021-01-26T05:30:00+05:30
వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి
గిద్దలూరు, జనవరి 26: వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాస గృహంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పంచాయతీలో టీడీపీ విజయం సాధించే విధంగా కృషి చేయాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాలలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో నెలకొన్న సమస్య ల గురించి ప్రతి ఇంటికి వెళ్ళి వివరిం చాలన్నారు. ప్రజలతో మమేకమవు తూ టీడీపీకి మద్దతుదారుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చే యాలని కోరారు. సమావేశంలో టీడీ పీ పట్టణ అధ్యక్షుడు షేక్ మస్తాన్, మండల శాఖ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, చిన్నకాశిరెడ్డి, రామసుబ్బారెడ్డి, గోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-26T05:30:00+05:30 IST