ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కుమారుడిది హత్యే ?

ABN, First Publish Date - 2021-01-17T06:12:22+05:30

మండలంలోని జెపుల్లలచెరువు గ్రామంలో ఈ నెల 9న పసుపులేటి జయకుమార్‌ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని స్థితిలో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరుగురిపై ఫిర్యాదు చేసిన తల్లి

విచారణ చేపట్టిన పోలీసులు

రాచర్ల, జనవరి 16 : మండలంలోని జెపుల్లలచెరువు గ్రామంలో ఈ నెల 9న పసుపులేటి జయకుమార్‌ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని స్థితిలో మృతిచెందాడు. దీనిపై వీఆర్‌వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, తన కుమారుడు జయకుమార్‌ను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని అతని తల్లి పి.చిన్నవెంకటలక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. జయకుమార్‌ 9వ తేదీ రాత్రి మద్యం సేవించి తన ఇంటి సమీప వారితో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాడు. దీంతో ఆయన్ను కొట్టి ఇంట్లో  ఫ్యాన్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని జయకుమార్‌ తల్లి చిన్నవెంకటలక్ష్మమ్మ గ్రామానికి చెందిన ఆరుగురు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ కేసు వ్యవహారం గ్రామంలో సంచలనంగా మారింది. చనిపోయిన రోజు కాకుండా మరుసటి రోజు గ్రామంలో కూడా అక్కడక్కడా జయకుమార్‌ మృతి హత్యనా, ఆత్మహత్యనా చర్చ జరిగింది. దీనిపై స్థానిక ఎస్‌ఐ మాట్లాడుతూ జయకుమార్‌ మృతిచెందిన సంఘటనపై ఆయన తల్లి చిన్నవెంకటలక్ష్మమ్మ ఆరుగురిపై ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, శనివారం దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-01-17T06:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising