ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ABN, First Publish Date - 2021-09-16T06:58:11+05:30

వైసీపీకి గుడ్‌బై చెప్పి..

టీడీపీలో చేరిన అనంతరం అశోక్‌రెడ్డికి పూలమాల వేస్తున్న కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న వలసలు 

అశోక్‌రెడ్డి సమక్షంలో సైకిలెక్కిన 600మంది  


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): గిద్దలూరు నియోజకవర్గంలోని మరో గ్రామంలో వందలాది మంది అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పి విపక్ష టీడీపీలో చేరిపోయారు. ఇటీవల కొమరోలు మండలం రాజుపాలెంలో 125కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరగా బుధవారం రాచర్ల మండలం అన్నంపల్లిలో 600 మంది అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి సైకిలెక్కారు. బుధవారం సాయంత్రం ఆ గ్రామంలో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన శిరిగిరి వెంకటపతితోపాటు మరికొందరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో భారీగా టీడీపీలో చేరారు. ప్రధానంగా కాపు, బోయ, యాదవ సామాజికవర్గాలకు చెందిన వైసీపీ వర్గీయులు పార్టీ మారిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సభ అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన కొంతసేపటికి ఆ గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ముగిసిన తర్వాత రావటం చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-09-16T06:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising