ఒంగోలు నియోజకవర్గంలోకి చేరుకున్న మహాపాదయాత్ర
ABN, First Publish Date - 2021-11-12T17:20:12+05:30
అమరావతి రైతుల మహాపాదయాత్ర శుక్రవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది.
ప్రకాశం జిల్లా: అమరావతి రైతుల మహాపాదయాత్ర శుక్రవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి పాదయాత్ర ఒంగోలు నియోజకవర్గంలోకి చేరుకుంది. ఇవాళ 14 కిలోమీటర్లమేర పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు ఒంగోలు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలు, నిబంధనలను లెక్క చేయకుండా రాజధాని రైతులకు మద్దతు తెలుపుతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివస్తున్నారు. వైసీపీ మినహా అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నేతలు పాదయాత్రకు హాజరై అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు.
Updated Date - 2021-11-12T17:20:12+05:30 IST