వ్యాక్సిన్పై అపోహలు వీడాలి
ABN, First Publish Date - 2021-06-20T07:02:32+05:30
రోనా వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కనిగిరి, జూన్ 19: కరోనా వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఫౌండేషన్ కౌన్సిలర్ సీహెచ్ మాధవి పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. నేడు (ఆదివారం) జరగబోయే ప్రత్యేకమైన వ్యాక్సిన్ డ్రైవ్లో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. అదే విధంగా ఐదేళ్లలోపు పిల్లల తల్లులు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో గుడ్హెల్ప్ రమేష్, సచివాలయ సిబ్బంది మాధవి, ఐిసీడీఎస్ శామ్యూల్, మహిళా పోలీసులు, ఏఎన్ఎం లక్ష్మి, ఆశా వర్కర్, శివ, మాల్యాద్రి పాల్గొన్నారు.
Updated Date - 2021-06-20T07:02:32+05:30 IST