కుంట భూమిని ఆక్రమిస్తే చర్యలు
ABN, First Publish Date - 2021-01-16T05:36:15+05:30
పట్టణానికి సమీపంలో ఉన్న కాకానికుంట భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఆమేరకు అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయించారు. ‘పండుగ సందట్లో కాకానికుంట కబ్జా’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం కథనం ప్రచురితమైన విషయం విదితమే.
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించిన తహసీల్దార్
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
అద్దంకి, జనవరి 15 : పట్టణానికి సమీపంలో ఉన్న కాకానికుంట భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఆమేరకు అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయించారు. ‘పండుగ సందట్లో కాకానికుంట కబ్జా’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై తహసీల్దార్ స్పందించారు. ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 955 సర్వే నెంబరులో 20.25 ఎకరాలు కుంట- ప్రభుత్వ భూమిగా ఉందని, సదరు భూమి విషయమై హైకోర్టులో స్టేటస్కో ఉన్నదని హెచ్చరిక బోర్డులో స్పష్టం చేశారు. ఆ భూమిని ఆక్రమించడం,ప్రవేశించడం చట్టరీత్యా నేరమని అందులో పేర్కొన్నారు. వాటిని అత్రిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2021-01-16T05:36:15+05:30 IST