ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురిచేడు పీహెచ్‌సీకి‘కాయకల్ప’ అవార్డు

ABN, First Publish Date - 2021-07-25T07:12:58+05:30

కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2019-20 సంవత్సరానికి గాను కాయకల్ప అవార్డు దక్కింది.

అవార్డు అందజేస్తున్న జేసీ చేతన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురిచేడు. జూలై 24: కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2019-20 సంవత్సరానికి గాను కాయకల్ప అవార్డు దక్కింది. జేసీ చేతన్‌ చేతుల మీదగా డీఎంహెచ్‌వో రత్నావళి సమక్షంలో వైద్యాధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని సిబ్బంది ఘనంగా సన్మానించారు డాక్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ... వైద్యశాలకు అవార్డు రావడం వెనుక సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. ఉన్నత లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం కాయకల్ప కార్యక్రమం చేపట్టిందన్నారు. నిబంధనలు పాటించడం, అవగాహన బోర్డుల ఏర్పాటు, ఆసుపత్రిలో ఓపీల నిర్వహణ, నోటీసు బోర్డులు, రోగుల వార్డులు, ఆసుపత్రి లోపల బయటా పరిశుభ్రంగా ఉంచడం, అన్ని జాతీయ కార్యక్రమాలు అమలు చేయడం, ఆసుపత్రుల్లో ప్రసవాల నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నారు. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యాధికారులు ప్రవీణ్‌, సుధారాణిలను సిబ్బంది వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో హెచ్‌ఈవో సుభాని, పీఎంవో హెరాల్డ్‌, హెచ్‌ఎస్‌ విజయకుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T07:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising