జస్టిస్ రమణపై అభిమానాన్ని చాటుకున్న ఒంగోలు ప్రజలు
ABN, First Publish Date - 2021-04-13T16:37:21+05:30
భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 24న బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ...
ఒంగోలు: భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 24న బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ... ఒంగోలు పట్టణంలో అభిమానులు, ప్రజలు పలు చోట్ల హోర్డింగులు వేయించారు. వీటిని పలువురు ఆసక్తిగా గమనిస్తూ.. తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. జస్టిస్ రమణను దేశంలో అత్యున్నత పదవి వరించడంతో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగువారికి గర్వకారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - 2021-04-13T16:37:21+05:30 IST