కళాశాలను అర్ధంతరంగా మూసివేయడం నేరం
ABN, First Publish Date - 2021-10-20T05:46:00+05:30
విద్యాసంవత్సరం మధ్యలో కాలేజీని అర్ధంతరం గా మూసివేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం చాలా నేరం అని ఆర్ఐవో సుబ్బారావు హెచ్చరించా రు. మంగళవారం అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక గాయత్రి జూనియర్ కళాశాల డైరెక్టర్ సిద్ధయ్య, అధ్యాపకుల తో సమావేశం నిర్వహించా రు. కళాశాల మూసివేయడంపై ఆర్ఐవో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆర్ఐవో సుబ్బారావు
విద్యార్థులకు సర్టిఫికెట్లు, ఫీజులు, టీసీలు వాపసు ఇవ్వాలని ఆదేశం
అద్దంకిటౌన్, అక్టోబరు 19 : విద్యాసంవత్సరం మధ్యలో కాలేజీని అర్ధంతరం గా మూసివేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం చాలా నేరం అని ఆర్ఐవో సుబ్బారావు హెచ్చరించా రు. మంగళవారం అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక గాయత్రి జూనియర్ కళాశాల డైరెక్టర్ సిద్ధయ్య, అధ్యాపకుల తో సమావేశం నిర్వహించా రు. కళాశాల మూసివేయడంపై ఆర్ఐవో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతోపాటు అధ్యాపకులందర్నీ బుధవారం కళాశాలకు పిలిపించి వారి నుం చి తీసుకున్న సర్టిఫికెట్లు, ఫీజులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. అలాగే టీసీలూ ఇవ్వాలని చెప్పారు. అ ధ్యాపకులకు ఇవ్వాల్సిన జీతాలను పెండింగ్ లేకుండా ఇచ్చేయాలని సిద్ధయ్యను ఆదేశించారు. కాగా ఆర్ఐవో చెప్పిన విధంగా గాయత్రి జూనియర్ కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులు, ఇం టర్ బోర్డు వద్ద ఆందోళన చేస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షుడు జ్యోతి రమే్షబాబు హె చ్చరించారు.
Updated Date - 2021-10-20T05:46:00+05:30 IST