వైసీపీ పాలనలో పెరిగిన అరాచకాలు : టీడీపీ
ABN, First Publish Date - 2021-11-26T05:05:25+05:30
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బడుగు, బలహీన వర్గాలతో పాటు ముస్లిం మై నారిటీలపై దాడులు, అరాచకాలు పెట్రేగి పోతున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీలు బొల్లా మాల్యాద్రిచౌదరి, ఎం హుస్సేన్రావుయాదవ్లు ఆరోపించారు.
పామూరు, నవంబరు 25: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బడుగు, బలహీన వర్గాలతో పాటు ముస్లిం మై నారిటీలపై దాడులు, అరాచకాలు పెట్రేగి పోతున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీలు బొల్లా మాల్యాద్రిచౌదరి, ఎం హుస్సేన్రావుయాదవ్లు ఆరోపించారు. గుంటూరుజిల్లా గురజాలలో సైదాపై జరిగిన మారణ హోమాన్ని ఖండిస్తూ స్థానిక శేషమహల్ ప్రాంగణంలో గురువారం సమావేశం నిర్వహించారు. గురజాల నియోజకవర్గం తుమ్మలచెరువుకు చెందిన షేక్ సైదా స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఏజెంటుగా కూర్చున్నాడన్న కక్షతో బుధవారం దారికాచి అత్యంత పాశవికంగా కర్రలు, రాళ్లతో దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు కె సుభాషిణి, ఎం.గంగరాజుయాదవ్, వైఎస్ ప్రసాద్రెడ్డి, షేక్ ఖాజారహంతుల్లా, దేవరపు మాల్యాద్రి, ఎం రమణయ్య, షేక్ గౌస్బాష, డోలా శేషాద్రి, టి మాధవరావు, ఏ ప్రభాకర్చౌదరి, ఎన్ సాంబయ్య, జి శ్రీనివాసులు, మొబీనా మౌలాలి, రాహుల్యాదవ్, చిన్నహజరత్, ఆర్ఆర్ రఫీ, పి.హరీష్, శంకర్, ఎస్డి ఖాదర్బాష, షేక్ మస్తాన్, టి.చంద్ర, నూర్జహన్, టి రమాదేవి, ఆశా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-26T05:05:25+05:30 IST