వానొస్తే..నగరం మునకే !
ABN, First Publish Date - 2021-10-30T05:21:02+05:30
ఒంగోలులో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఉదయం నుంచి ఒక మోస్తరు జల్లులు పడుతూ మధ్యా హ్నం సమయంలో మంచివర్షం కురిసింది.
రోడ్లపై పారిన మురుగునీరు
రాకపోకలకు ఇబ్బందిపడిన ప్రజానీకం
ఒంగోలు(కలెక్టరేట్), అక్టోబరు 29 : ఒంగోలులో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఉదయం నుంచి ఒక మోస్తరు జల్లులు పడుతూ మధ్యా హ్నం సమయంలో మంచివర్షం కురిసింది. దీంతో నగరంలోని లాయర్పేట, మంగమూరురోడ్డు, కర్నూలురోడ్డు, చర్చిసెంటర్, గాంధీరోడ్డులలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరురోడ్లపైకి చేరాయి. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇంకొక వైపు శివారుకాలనీల్లో కూడా కాలువలు, రోడ్లు సరిలేక పోవడంతో కొద్దిపాటి వర్షానికి ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయింది. సాయంత్రం కూడా నగరంలో కొద్దిపాటి జల్లులు పడటంతో పాటు వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Updated Date - 2021-10-30T05:21:02+05:30 IST