వైభవంగా గోదాదేవి కల్యాణం
ABN, First Publish Date - 2021-01-14T05:19:51+05:30
ధనుర్మాసం, భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
మార్కాపురం (వన్టౌన్), జనవరి 13 : ధనుర్మాసం, భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు సోమయాజుల మల్లికార్జునశర్మ, నంద్యాల తిరుమలాచార్యులు, శ్రీపతి అప్పనాచార్యులు శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తికి శ్రీరంగనాఽథ స్వామి అలంకరణ చేశారు. గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శ్రీరంగనాథస్వామి, గోదాదేవి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక జవహర్నగర్ కాలనీలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం కమనీయంగా సాగింది. గుండ్లకమ్మ నదీ తీరాన వెలసియున్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ కల్యాణం నిర్వహించారు.
Updated Date - 2021-01-14T05:19:51+05:30 IST