బస్సు ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి
ABN, First Publish Date - 2021-01-16T05:10:02+05:30
ఒంగోలు నగర శివారులోని రావ్అండ్నాయుడు కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపట్నం మండలం పల్లెపాలేనికి చెందిన పెద్దిసింగి పవన్కుమార్(23) మృతి చెందాడు.
ఒంగోలు(క్రైం), జనవరి 15 : నగర శివారులోని రావ్అండ్నాయుడు కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపట్నం మండలం పల్లెపాలేనికి చెందిన పెద్దిసింగి పవన్కుమార్(23) మృతి చెందాడు. అతను ఒంగోలులోని ఓ క్లబ్లో స్విమ్మింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మృతుడి స్నేహితుడు గణే్షవర్ధన్ నగరానికి రాగా ఇరువురు కలిసి బైక్పై ఇంటికి వెళుతున్నారు. వారు రాంగ్రూట్లో వెళుతుండగా ఎదురుగా తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మోటార్సైకిల్ వెనుక కూర్చున పవన్కుమార్ బస్సు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని గణే్షవర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Updated Date - 2021-01-16T05:10:02+05:30 IST