భగవద్గీత కంఠస్థ పోటీలు
ABN, First Publish Date - 2021-12-06T05:16:40+05:30
పట్టణంలోని విశ్వభారతి పాఠశాల ఆవరణలో భగవద్గీత కంఠస్థ పోటీలను ఆదివారం నిర్వహించారు. 6 విభాగాలలో పోటీలు నిర్వహించారు.
గిద్దలూరు, డిసెంబరు 5 : పట్టణంలోని విశ్వభారతి పాఠశాల ఆవరణలో భగవద్గీత కంఠస్థ పోటీలను ఆదివారం నిర్వహించారు. 6 విభాగాలలో పోటీలు నిర్వహించారు. 80 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందచేశారు. గీత ప్రచార సేవా సమితి, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు సత్యానంద గురూజీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గీత ప్రచార సేవాసమితి అధ్యక్షుడు ఆర్.నరసింహారావు, కన్వీనర్ ఓబులేసు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కనకయ్య, కార్యదర్శి రాజు, విహెచ్పి నాయకులు భూపాల్రెడ్డి, చిన్నరామిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-12-06T05:16:40+05:30 IST