బంగ్లాదేశ్లో హిందువులపై అరాచకాలు దారుణం
ABN, First Publish Date - 2021-10-21T06:10:47+05:30
బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల దేవాలయాలు, గృ హాలపై కొన్ని ముస్లిం అరాచక శక్తులు దాడి చే యటం దారుణమని, దీన్ని ప్రతిఒక్కరూ తీవ్రం గా ఖండించాలని వీహెచ్పి, భజరంగదళ్, మా తృశక్తి, ఇస్కాన్ తదితర హిందూ ధార్మిక సం ఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఒంగోలు(కల్చరల్), అక్టోబరు 19: బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల దేవాలయాలు, గృ హాలపై కొన్ని ముస్లిం అరాచక శక్తులు దాడి చే యటం దారుణమని, దీన్ని ప్రతిఒక్కరూ తీవ్రం గా ఖండించాలని వీహెచ్పి, భజరంగదళ్, మా తృశక్తి, ఇస్కాన్ తదితర హిందూ ధార్మిక సం ఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు ని రసనగా బుధవారం నగరంలో కేశవస్వామిపేట నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అ నంతరం రాష్ట్రపతిని ఉద్దేశించి రాసిన వినతి పత్రాన్ని వారు కలెక్టర్ ప్రవీణ్కుమార్కు అంద జేశారు. ఈ సందర్భంగా సుభశ్రీ చైతన్యదాస్ మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి ఇటువంటి దాడులను ఖండించాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు సో మా సుబ్బారావు, తూనుగుంట మల్లిఖార్జునరా వు, పందరబోయిన పున్నారావు, పసుమర్తి వెంక టేశ్వర్లు, శ్రీరామనేని సీతాలక్ష్మి, రఘుపతి ప్రభు, రాధారమణ గుప్తా జంథ్యం తదితరులు పాల్గొ న్నారు.
Updated Date - 2021-10-21T06:10:47+05:30 IST