హైకోర్టులో పోతిన వెంకట మహేష్ పిటిషన్
ABN, First Publish Date - 2021-06-22T22:27:46+05:30
హైకోర్టులో పోతిన వెంకట మహేష్ పిటిషన్
అమరావతి: ఏపీ హైకోర్టులో జనసేన పార్టీ నేత పోతిన వెంకట మహేష్ పిటిషన్ వేశారు. రాజమండ్రి రీజినల్ జాయింట్ కమిషనర్గా సురేష్బాబుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈవోగా సురేష్బాబు హయాంలో దుర్గమ్మ ఆలయంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు, అవినీతిని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. నివేదికలో గత ఈవో సురేష్బాబు పాత్ర ప్రముఖంగా ఉందని ఆధారాలతో వివరించారని పేర్కొన్నారు.
Updated Date - 2021-06-22T22:27:46+05:30 IST