ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు అసహ్య పడేలా పోలీస్ వ్యవస్థ ఉంది: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-02-26T22:32:34+05:30

పోలీసులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు అసహ్యం పడేలా పోలీస్ వ్యవస్థ ఉందని ఆయన తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పోలీసులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు అసహ్య పడేలా పోలీస్ వ్యవస్థ ఉందని ఆయన తప్పుబట్టారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత తిరుపతయ్యను అచ్చెన్నాయుడు  పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అక్రమ దాడులను టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. టీడీపీకీ ఓటు వేశారన్న కక్షతో ఒక గిరిజన వ్యక్తి ప్రాణాలు తీయాలనుకున్నారని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికలలో 40శాతం టీడీపీ గెలిచిందని, వైసీపీ ఓడిపోయిందని దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించాలని డిమాండ్ చేశారు. దాడి జరిగి వారం అవుతున్న పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీకీ రమ్మంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated Date - 2021-02-26T22:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising