చదువుతో పాటు ఆటల్లో రాణించాలి: ఎమ్మెల్యే బాలరాజు
ABN, First Publish Date - 2021-11-10T21:12:37+05:30
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చదువుతో పాటు ఆటల్లో కూడా
పోలవరం: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చదువుతో పాటు ఆటల్లో కూడా విద్యార్థులు, యువకులు రాణించాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఐటీడీఏ కోట రామచంద్రాపురం స్టేడియంలో ఏపీ సీఎం కప్ పోలవరం నియోజకవర్గ స్ధాయి ఆటల పోటీలను ఎమ్మెల్యే బాలరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. సీఎం జగన్ ఆధ్యర్యంలో రాష్ట్రం ప్రభుత్వం ఆటలకు అధిక ప్రాముఖ్యత నిస్తుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే బాలరాజు వాలీబాల్ ఆడి అందరిని ఉత్సాహ పరిచారు.ఈ ఆటల పోటీలు ఆద్యంతం అద్భుతంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లు, ప్రజా ప్రతినిధులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,ఎంపీపీలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - 2021-11-10T21:12:37+05:30 IST