వసూల్ రెడ్డి పెట్రో ధరలు తగ్గించాలి: లోకేష్
ABN, First Publish Date - 2021-11-07T22:45:04+05:30
వసూల్ రెడ్డి ఫేక్ ప్రకటనలు మాని పెట్రో ధరలు తగ్గించాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలనుకున్న వైసీపీ
అమరావతి: వసూల్ రెడ్డి ఫేక్ ప్రకటనలు మాని పెట్రో ధరలు తగ్గించాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలనుకున్న వైసీపీ ప్రభుత్వం అభాసుపాలైందన్నారు. ప్రజాధనంతో సొంత పత్రికకు ప్రకటనలిచ్చి దోచుకుంటున్న ఘనుడు దేశచరిత్రలో జగన్ ఒక్కరేనని దుయ్యబట్టారు. కేంద్రం సహా 23 రాష్ట్రాలు పన్ను భారం తగ్గించినా వసూల్ రెడ్డి మాత్రం.. వెనక్కి తగ్గనంటూ ప్రకటనలిస్తున్నారని విమర్శించారు. యానాం వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటే తేడా తెలుస్తుందన్న మీరు.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా వ్యాట్ ఎందుకు తగ్గించలేదు? అని ప్రశ్నించారు. కేవలం రూ.1 సెస్ వేశామంటూ అబద్దాలు చెబుతున్నారని లోకేష్ మండిపడ్డారు.
Updated Date - 2021-11-07T22:45:04+05:30 IST