ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి: అయ్యన్న

ABN, First Publish Date - 2021-11-13T21:23:59+05:30

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, దయచేసి దొంగలకు ఓటు వేయద్దని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, దయచేసి దొంగలకు ఓటు వేయద్దని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సూచించారు. జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున అంబేద్కర్ విగ్రహం నుంచి టీడీపీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులు పాలుచేసిన ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. విజయ్ సాయిరెడ్డి, విశాఖను దోచుకొని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్‌ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం జగన్ భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే అరెస్టులు చేయిస్తావా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.

Updated Date - 2021-11-13T21:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising