ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్వాక్రా సంఘాలను కలుషితం చేసిన వైసీపీ: పీతల సుజాత

ABN, First Publish Date - 2021-10-08T23:57:10+05:30

సీఎం జగన్‌పై మాజీమంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశ్యంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): సీఎం జగన్‌పై మాజీమంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశ్యంతో 20 ఏళ్ల క్రితం మాజీ సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను స్థాపించారని సుజాత తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు శక్తివంతులయ్యారని గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని సుజాత ధ్వజమెత్తారు. గతంలో డ్వాక్రా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఉండేవని చెప్పారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను కలుషితం చేశారని దుయ్యబట్టారు. రాజకీయ ఒత్తిడులతో అనేక ఆంక్షలు పెట్టి కొన్ని సంఘాలకు లబ్ది కలగకుండా చేశారని తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన సబ్ ప్లాన్ నిధులను నేడు అసరా పేరుతో దారిమళ్లించి చెల్లిస్తున్నారని సుజాత విమర్శించారు. 

Updated Date - 2021-10-08T23:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising