జగన్ ప్రజలను దోచుకుంటున్నారు: పట్టాభిరామ్
ABN, First Publish Date - 2021-07-06T20:16:27+05:30
చాలా రాష్ట్రాలు ప్రజల కోసం వేల కోట్ల ప్యాకేజీలు ఇస్తుంటే.. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలను దోచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు.
అమరావతి: చాలా రాష్ట్రాలు ప్రజల కోసం వేల కోట్ల ప్యాకేజీలు ఇస్తుంటే.. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలను దోచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ఆగకుండా ఆస్తిపన్ను పెంచారన్నారు.పనికిమాలిన సీఎం మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యుత్ ఛార్జీ పైసా పెంచకుండా పాలన సాగించారన్నారు. ప్రజలను విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుతున్న సీఎం జగన్కు..తెలంగాణ నుంచి రావాల్సిన 5,732 కోట్ల బకాయిలు గుర్తులేవా?అని పట్టాభి ప్రశ్నించారు.
Updated Date - 2021-07-06T20:16:27+05:30 IST