రాజకీయ నిరుద్యోగులకు నిలయాలుగా పీఏసీఎస్లు
ABN, First Publish Date - 2021-07-04T02:18:06+05:30
అధికార పార్టీ రాజకీయ నిరుద్యోగులకు నిలయాలుగా ఏపీలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి
అమరావతి: అధికార పార్టీ రాజకీయ నిరుద్యోగులకు నిలయాలుగా ఏపీలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)ను ఎమ్మెల్యేలు మార్చేశారని జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సొసైటీ కార్యక్రమాల్లో రాజకీయ జోక్యానికి తావివ్వకూడదనే నిబంధనలకు నీళ్లు వదిలారన్నారు. నిబంధనలకు నీళ్లొదిలి చాలాచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు అనునచరులను సొసైటీ చైర్ పర్సన్లుగా, డైరెక్టర్లుగా ఏకపక్షంగా నియమిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు.
Updated Date - 2021-07-04T02:18:06+05:30 IST