ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతించిన గోదావరి

ABN, First Publish Date - 2021-07-27T07:09:25+05:30

ఉగ్ర గోదావరి శాంతించింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద సోమవారం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 31.44 మీటర్లు ఉంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరణ

సముద్రంలోకి 7,76,223 క్యూసెక్కుల ప్రవాహం


రాజమహేంద్రవరం, పోలవరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఉగ్ర గోదావరి శాంతించింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద సోమవారం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 31.44 మీటర్లు ఉంది. స్పిల్‌వే గుండా 5,69,976 క్యూసెక్కుల నీరు కిందకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7,76,223 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. పోలవరం ముంపు గ్రామాల్లో వరద నెమ్మదిగా తగ్గుతోంది. కోనసీమ లంకల్లో వరద ఎక్కువగానే ఉంది. భద్రాచలం వద్ద 32.74 అడుగుల నీటిమట్టం ఉంది. పోలవరంలో గోదావరి నీట్టిమట్టం పెరగడంతో కడెమ్మ స్లూయిజ్‌గేట్లు పూర్తిగా మునిగిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న గ్రామాలు నీట మునిగాయి. తల్లవరం, గాజులగొంది, పెద్దూరు, వాడపల్లి గ్రామాల ప్రజలు తాత్కాలిక నివాసాల్లోకి చేరుకున్నారు. అధికారులు ముంపు గ్రామాలకు నిత్యవసరాలు, దోమల కాయి ల్స్‌, జనరేటర్లకు ఆయిల్‌, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Updated Date - 2021-07-27T07:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising