కొండపల్లి మైనింగ్పై విచారణకు ఆదేశం..
ABN, First Publish Date - 2021-09-01T17:45:42+05:30
అమరావతి: కొండపల్లి మైనింగ్పై టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై.. ఎన్హెచ్ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) స్పందించింది. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్పై వర్ల రాసిన లేఖపై విచారణకు
అమరావతి: కొండపల్లి అక్రమ మైనింగ్పై టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై.. ఎన్హెచ్ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) స్పందించింది. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్పై వర్ల రాసిన లేఖపై విచారణకు ఆదేశించింది. చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి.. ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. అలాగే తీసుకున్న చర్యలపై 8వారాల్లోగా ఫిర్యాదుదారుకు వివరణ ఇవ్వాలని లా రిజిస్ట్రార్కు సూచించింది. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు పోరాటం చేస్తున్న విషయం విదితమే.
Updated Date - 2021-09-01T17:45:42+05:30 IST