కోదండరామస్వామి కల్యాణానికి సీఎం జగన్ హాజరు
ABN, First Publish Date - 2021-04-10T02:00:09+05:30
జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈ సారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో
కడప: జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈ సారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. రాములోరి కల్యాణానికి కేవలం 5 వేల మంది భక్తులకు మాత్రమే పాసుల ద్వారా అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. స్వామివారి కల్యాణానికి సీఎం జగన్ దంపతులు హాజరవుతారని ఆయన తెలిపారు. స్వామివారికి సీఎం జగన్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో జవహర్రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-04-10T02:00:09+05:30 IST