‘ఒంటిమిట్ట’ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN, First Publish Date - 2021-04-22T10:28:54+05:30
ఒంటిమిట్ట కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాదీ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
- ఎమ్మెల్యే మేడా పరివారం రాకపై విపక్షాల విమర్శలు
ఒంటిమిట్ట, ఏప్రిల్ 21: ఒంటిమిట్ట కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాదీ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ధ్వజారోహణకు రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే, ఆయన వెంట వైసీపీ నాయకులు, అనుచరగణం భారీగా హాజరవడంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీటీడీ, ఆర్కియలాజికల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
Updated Date - 2021-04-22T10:28:54+05:30 IST