పశ్చిమలో ఓఎన్జీసీ గ్యాస్ టెస్టింగ్
ABN, First Publish Date - 2021-04-17T09:45:10+05:30
పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం నార్త్లో ఓఎన్జీసీ చేపట్టిన గ్యాస్ పరీక్షలు పరిసర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.
ఎగసిపడిన ఆగ్నికీలలు.. భయందోళనలో గ్రామస్థులు
నరసాపురం, ఏప్రిల్ 16: పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం నార్త్లో ఓఎన్జీసీ చేపట్టిన గ్యాస్ పరీక్షలు పరిసర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. శుక్రవారం ఉదయం నుంచి మంటలు ఎగసిపడటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకొచ్చారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో రెవెన్యూ, పోలీసులు హుటాహుటిన రిగ్గు వద్దకు చేరుకున్నారు. ఆరా తీస్తే తవ్వకాల్లో బయటపడిన గ్యాస్ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. ఓఎన్జీసీ ప్లాంట్ అధికారి ఎం.ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తవ్వకాల్లో వెలుగు చూసిన నిక్షేపాలు పరీక్షించేందుకు ఇలాంటి పరీక్షలు నిర్వహించడం సర్వసాధారణమన్నారు.
Updated Date - 2021-04-17T09:45:10+05:30 IST