ఏలూరు మేయర్గా నూర్జహాన్
ABN, First Publish Date - 2021-07-31T08:49:46+05:30
ఏలూరు నగర పాలక సంస్థ నూతన పాలక మండలి కొలువుతీరింది. నగర మేయర్గా రెండోసారి షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయి సుధీర్బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ఏలూరు ఫైర్స్టేషన్, జూలై 30 : ఏలూరు నగర పాలక సంస్థ నూతన పాలక మండలి కొలువుతీరింది. నగర మేయర్గా రెండోసారి షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయి సుధీర్బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా నూతనంగా ఎన్నికైన 48 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. వైసీపీ 50వ డివిజన్ కార్పొరేటర్ షేక్ నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా 9వ డివిజన్ కార్పొరేటర్ జి.శ్రీనివాస్ ప్రతిపాదించగా, 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు బలపరిచారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ ప్రకటించారు.
Updated Date - 2021-07-31T08:49:46+05:30 IST