రఘురామ పిటీషన్పై ప్రతివాదులకు నోటీసులు
ABN, First Publish Date - 2021-06-24T00:57:38+05:30
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్పై రఘురామ వేసిన పిటీషన్పై ప్రతివాదులకు ఏపీ హైకోర్టు
విజయవాడ: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్పై రఘురామ వేసిన పిటీషన్పై ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో తమవైపు నుంచి వాదనలు వినిపించేందుకు అనుమతించాలని హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటీషన్ వేసారు. సరస్వతి పవర్కు ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజు, నీటి సరఫరా అనుమతులను రద్దు చేయాలని రఘురామ కోరారు. సీబీఐ కేసులున్నాయని కోర్టుకు తెలపకుండా అనుమతులు తీసుకున్నారని రఘురామ పిటీషన్లో పేర్కొన్నారు. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2021-06-24T00:57:38+05:30 IST