చంద్రబాబుకు నోటీసుల జారీపై తర్జనభర్జన
ABN, First Publish Date - 2021-05-10T14:37:22+05:30
కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసుల జారీపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. డీజీపీ ఆదేశాల కోసం కర్నూలు పోలీసులు వేచి చూస్తున్నారు.
కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసుల జారీపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. డీజీపీ ఆదేశాల కోసం కర్నూలు పోలీసులు వేచి చూస్తున్నారు. ఆదివారమే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. డీజీపీ నుంచి ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. లాయర్ సుబ్బయ్య ఫిర్యాదుతో చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైంది. మరోవైపు కొత్త వైరస్పై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా మంత్రి అప్పలరాజుపై కూడా కేసులు నమోదు చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Updated Date - 2021-05-10T14:37:22+05:30 IST